ఎవరెస్ట్‌పై ఎగిరింది పసుపు జెండా

81 ఏళ్ల వయసులో వృద్ధుడి రికార్డ్‌

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను 81 ఏళ్ల వయసులో అధిరోహించి తెలుగుదేశం జెండాను ఎగురవేసి అభిమానాన్ని చాటుకున్నాడు ప్రత్తిపాడు గ్రామానికి చెందిన గింజుపల్లి శివప్రసాద్‌. ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ అధిరోహించిన అత్యంత పెద్ద వయ స్కుడిగా ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఆయనను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అభినందించారు.