Mahanaadu-Logo-PNG-Large

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమలత

తిరుపతి: తిరుమల వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ నాయకురాలు, సినీ నటి సుమలత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండి తులు ఆశీర్వాదం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మా కొడుకు పెళ్లి అయిన తర్వాత మొదటిసారి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీత మరలా గెలుస్తుందని, నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అవుతారని తెలిపారు.