ప్రజలకు అండగా ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలు

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌
55వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం

గుంటూరు, మహానాడు: జగన్‌ అరాచక పాలనను అరికట్టి ప్రజలకు టీడీపీ జెండా అండగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే టీడీపీ ఆధ్వర్యంలో సూపర్‌ సిక్స్‌ భరోసా ఇస్తోందని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 55వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు అభ్యర్థి నశీర్‌ అహ్మద్‌తో కలిసి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా చర్మకారులను, చిరు వ్యాపారులు, నివాసితులను పెమ్మసాని కలుసు కున్నారు. వృత్తి పరమైన, స్థానిక సమస్యలతో పాటు అధికార పార్టీ స్థానిక నాయకుల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఇంటి పట్టాలు, తాగునీటి సమస్యలు, పెరిగిన కరెంటు చార్జీలు తదితర సమస్యల ను ప్రజలు పెమ్మసాని ముందు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ కేవలం రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

నక్కా ఆనంద్‌బాబును కలిసిన పెమ్మసాని
మాజీ మంత్రి నక్కా ఆనందబాబును డాక్టర్‌ పెమ్మసాని శనివారం ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సమస్యలపై, గతంలో టీడీపీ తీసుకున్న అభివృద్ధి నిర్ణయాలపై చర్చించారు.