ప్రజల అభివృద్ధికి సూపర్‌సిక్స్‌ పథకాలు

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

చిలకలూరిపేట, మహానాడు : ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలతో రాష్ట్ర ప్రజల జీవనచిత్రమే మారనుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి ఫుల్లారావు అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేట 32, 33 డివిజన్లలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో ప్రత్తిపాటి ఫుల్లారావు కలిసి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎంతో ఆలోచించిన తర్వాత అధినేత చంద్రబాబు ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ పథకాలతో పేదరికం, కష్టాలు లేని సమాజం స్థాపించడమే పార్టీ లక్ష్యం. రానున్న ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు తెలియజేసి కరపత్రాలు పంపిణీ చేసి పార్టీ ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలతో అన్నివర్గాల సంక్షేమం సాధ్యమని అవగాహన కల్పించాం.