– ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ
– ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం వ్యవస్థ
– టోల్ఫ్రీ నెంబర్, ఈ మెయిల్తో విస్తృత ప్రచారం
అమరావతి, మహానాడు : రాష్ట్రంలో ఇసుక, మైనింగ్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మార్గదర్శకా లు విడుదల చేసింది. ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని సూచించింది. టోల్ఫ్రీ నెంబర్, ఈ మెయిల్ ఏర్పాటుతో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. ఎన్జీటీ తీర్పులో పేర్కొన్న ప్రతి అంశాన్ని తప్పక పాటించాలని, కోర్టు ఉత్తర్వులు పాటించని వారిపై ఉల్లంఘన చర్యలకు వెనుకాడొద్దని స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో ఇసుక, మైనింగ్పై తదుపరి విచారణ జూలై 15న చేపట్టనున్నట్లు వెల్లడిరచింది.
ఇసుక, మైనింగ్పై మార్గదర్శకాలివే
కేంద్ర పర్యావరణ శాఖ తరచూ తనిఖీలు చేపట్టాలి. తనిఖీల సమాచారం రాష్ట్ర అధికారులకు ఇవ్వనవసరం లేదు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చర్యలకు వెనుకాడవద్దు. ఎన్జీటీ తీర్పులోని ప్రతి అంశం తప్పక పాటించాలి. కేంద్ర అధికారులు గుర్తించిన మైనింగ్ ప్రదేశాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. మైనింగ్ జరిగిన ప్రదేశాలను కలెక్టర్లు తనిఖీ చేయాలి. ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి. జూలై 9వ తేదీలోపు ఆదేశాల అమ లుపై కేంద్రం, రాష్ట్రం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.