టీడీపీ నేతల సస్పెన్షన్‌

అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పలువురు నేతలను సస్పెండ్‌ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాంకుమార్‌, పోల వరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటూకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్‌లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు వివరించారు.