-తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
-ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
హైదరాబాద్: తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ను సర్వాంగ సుందరం గా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. జూన్ 2న ఆవిర్భావ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవు తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక ప్రదర్శనలు, కార్నివాల్
ప్రజలు తమ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని ఆనందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు, ప్రధాన వేదికపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’పై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నారు. బాణసంచా పేలుస్తూ ఉత్సవ వాతవరణాన్ని అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్లతో ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి.
ఏర్పాట్లను సమీక్షించిన ఉన్నతాధికారులు
ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పలు విభాగాల ఉన్నతా ధికారులు ట్యాంక్ బండ్ వేదిక వద్ద పరిశీలించారు. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిధిలకు, పాల్గొనే ప్రజలకు సీటింగ్, బారికేడిరగ్, పార్కింగ్, తాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, పంచా యత్రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిట న్ కమిషనర్ ఆమ్రపాలి, సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీజీ శివధర్రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఏర్పాట్లను సమీక్షించారు.