-ప్రభాకర్రావు సాయంతో వ్యవహారం
-కాంగ్రెస్ రాగానే ధ్వంసం చేయమన్నాడు
-వాంగ్మూలంలో ప్రణీత్రావు కీలక విషయాలు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడిరచారు. 1200 మంది ఫోన్లను టాప్ చేసినట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్పిన ఆయన 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉన్నట్లు వివరించారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లు చెప్పారు. ఆయన వాంగ్మూలంలో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసే వారి డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నాం. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించాం. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నాం.
ఈ ల్యాబ్కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్ సాయంతో ట్యాపింగ్ను విస్తృతంగా చేశాం. ప్రభాకర్రావు సహాయంతో 17 సిస్టమ్స్ ద్వారా ట్యాపింగ్కు పాల్పడ్డాం. రెండు లాగర్ రూమ్లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ వ్యవహారం నడిపాం. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ట్యాపింగ్ను ఆపివేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్రావు చెప్పాడు. ఆయన రాజీనామా చేసి వెళ్లిపోతూ టైపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయా లని ఆదేశించాడు. ఆయన ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకువచ్చాం. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్లు ఫిక్స్ చేశాం. 17 హార్డ్ డిస్క్లలో అత్యంత కీలకమైన సమాచారం ఉంది. వాటిని కట్టర్తో కట్ చేసి ధ్వంసం చేశాం. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్తో ఐడీపీఆర్ డేటా మొత్తాన్ని కూడా కాల్చివేశాం. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్ టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులలో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేశాం. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను నాగోల్ మూసారంబాగ్ మూసిలో పడవే శాం. సెల్ఫోన్లు, పెన్ డ్రైవ్లను కూడా బేగంపేట నాలాలో వేసినట్లు తెలిపారు.