పిఠాపురం, మహానాడు: పిఠాపురం పరిధిలోని నరసింగపురం గ్రామంలో గత ప్రభుత్వం పట్టణ నిరుపేదలకు కోసం కేటాయించిన స్థలాలను మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ రెడ్డి మాట తీరు బాలేదని, కూటమి ప్రభుత్వం అధికార చేపట్టాక జగన్ రెడ్డి ఏమి మాట్లాడుతున్నాడో అర్ధం కాని పరిస్టితి నెలకొందని విమర్శించారు. పట్టణ నిరుపేదలకు స్థలాలు కోసం ఇచ్చిన 64 ఎకరాలలో సుమారుగా 30 కోట్ల స్కాం జరిగిందని, వర్షాలకే మోకలోతు నీరుతో నిండుతుందని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డికి ప్రతి నియోజకవర్గం నుండి భూసేకరణ, స్థలాలు ఫిల్లింగ్ లో ముడుపులు అందాలని, ఇదే వ్యవహారశైలితో వైసీపీ పాలన చేశారన్నారు. త్వరలో మా కూటమి ప్రభుత్వం తరుపున నిరుపేదలకు కేటాయించిన స్థలాలు పై ఏమి చేయాలి, ఎలా చేయాలి అనే విషయంపై స్టడీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సకుమళ్ళ గంగాధర్, నల్లా శ్రీను, మొల్లి మరిడి రాజు, రాయుడు గణేష్, రాయుడు రాజు తదితరులు పాల్గొన్నారు.