Mahanaadu-Logo-PNG-Large

కూటమి తిరుగులేని విజయం సాధించబోతోంది

-ఎన్నికల్లో మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేశారు
-కౌంటింగ్‌ రోజున అల్లర్లకు పాల్పడేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది
-పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ వైసీపీ కొర్రీలు వేయాలని చూసింది
-డిక్లరేషన్‌ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు రావాలి
-కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
-కౌంటింగ్‌ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు సూచన
-కాన్ఫరెన్స్‌లో నేతలకు సూచనలు ఇచ్చిన బీజేపీ నేతలు పురంధేశ్వరి, అరుణ్‌ సింగ్‌, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

అమరావతి : ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని అన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నాయుడు ఆదివారం జూమ్‌ కాల్‌ నిర్వహించారు. కౌంటింగ్‌ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతల కు పలు సూచనలు చేశారు. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశ్యంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేశారు. ఓటమి భయంతో కౌంటింగ్‌ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోంది. తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలు పెట్టింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారు.

కౌంటింగ్‌ రోజు జాగ్రత్త
కౌంటింగ్‌ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉంది. కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్‌ ఏజెంట్లు, చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలి. ఈవీ ఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవ హరించాలి. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకూ ఎవరూ అశ్రద్ధ వహించొద్దు. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్‌ కౌంటింగ్‌ కేంద్రంలోనే ఉండాలి. ఆర్వో వద్ద డిక్లరేషన్‌ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్‌ గది నుండి బటయకు రావాలి.’’ అని సూచించారు. బీజేపీ జనరల్‌ సెట్రకరిటీ అరుణ్‌ సింగ్‌ మాట్లాడు తూ ఏపీలో ఎన్డీయేకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైందని, రాష్ట్రంలోనూ 53 శాతం ఓట్లతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయబోతోందన్నారు. లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్‌ అడిగాలని సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ. ..కౌంటింగ్‌ సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని, ప్రతి అభ్యర్థి లీగల్‌ టీంను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరే శ్వరి, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సూచించారు.