ఆమె ధైర్యంగా ఉన్నారు..పోరాడుదామన్నారు
ఢిల్లీ లిక్కర్ కేసులో పీఎంఎల్ఏ వర్తించబోదు
పాలసీ నేరమైతే కేంద్రం కూడా నేరం చేసినట్లే
నల్లచట్టాలు తెచ్చిన మోదీని అరెస్టు చేయాలి కదా?
ములాఖాత్ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్, బాల్క సుమన్ వ్యాఖ్యలు
హైదరాబాద్, మహానాడు : కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. న్యాయవాదికి నోటీసులు ఇవ్వ కుండానే జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్టు చేసిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్పై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రికి జడ్జిని మార్చారంటే ఏ విధంగా వేధించాలని ప్రయత్నిస్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలోని తిహార్ జైలులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మోదీ కూడా నేరస్తుడే…
ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలు రకరకాల పాలసీలు చేస్తుంటాయని, ఆ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. ఆ పాలసీల అమలులో పాల్గొన్న వారు నేరస్తులైతే కేంద్ర ప్రభుత్వం కూడా నేరం చేసినట్లే అవుతుంది కదా అని ప్రశ్నించారు. కేంద్రం రైతులకు సంబంధించి మూడు నల్లచట్టాలను తీసుకొచ్చింది. ఆరునెలల తర్వాత ఉపసంహరించుకున్నారు. మరి మోదీ ఎవరి ప్రయోజనాల కోసం ఆ చట్టాలను తీసుకొచ్చారు? ఆయనను అరెస్టు చేయాలి కదా? అని ప్రశ్నించారు. నిర్దోషిగా నిందితులే నిరూపించుకో వాలని, అంతవరకు జైలులో పెట్టవచ్చన్న పీఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 50లో ఉన్న చిన్న నిబంధనను అడ్డంపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను గొంతు నొక్కే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. టెర్రరిస్టులకు ఆర్థిక వనరులు చేరడం, డ్రగ్స్ రవాణాకు నిధుల వినయోగం, దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలించే చర్యలకు పీఎంఎల్ఏ చట్టం వర్తిస్తుందన్నారు.
డబ్బు దొరకందే..అరెస్టు ఎలా చేస్తారు?
ఈ కేసులో ఎక్కడా డబ్బు దొరకలేదని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపి స్తున్న రూ.100 కోట్లు ఎక్కడ అని అడిగారు. డబ్బు స్వాధీనం చేసుకోకుండా వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అలాంటప్పుడు కేసుకు పీఎంఎల్ఏ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. లంచం డిమాండ్ చేసినట్లు కూడా ఈ కేసులో లేనప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తింపజేశారని అడిగారు. సహ నింది తుల నుంచి, అప్రూవర్ల నుంచి బలవంతంగా వాంగ్మూలాలను తీసుకుని కవిత ను నిందితులుగా చేశారు. అన్ని వ్యవస్థలను నియంత్రణలో ఉంచుకుని మోదీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని వ్యాఖ్యానించారు.
బీజేపీలో చేరితే కేసులు ముందుకు కదలవా?
కేసులో ఇతరులను ఇరికివ్వడానికి వాళ్ల పేర్లను చెప్పాలని, వీళ్ల పేర్లను చెప్పా లని దర్యాప్తు సంస్థలు ఒత్తిడి చేసినట్లు కవిత తమకు చెప్పారని వెల్లడిరచారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, చగన్ భుజబల్, ప్రఫుల్ పటేల్ వంటి వారిపై ఉన్న కేసులు ఎందుకు ముందుకు సాగలేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరిన వారి కేసులు ముందుకు సాగబోవడం లేదని, బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తని వారో వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కోర్టులను కూడా భయ పెట్టిస్తున్నదని ఆరోపణ చేశారు.
కవిత ధైర్యంగా ఉన్నారు…
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ఇలాంటి కేసులతో బెదిరిస్తార నుకుంటే అది బీజేపీ భ్రమే అవుతుందని స్పష్టం చేశారు. కవిత ధైర్యంగా ఉన్నా రని, ఇలాంటి కేసులను అదిరేది, బెదిరేది లేదని తేల్చిచెప్పారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై, ఫాసిస్టు విధానాలపై ఇంకా గట్టిగా పోరాడుదామని చెప్పా రని వెల్లడిరచారు. న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటామని ప్రకటించారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించామని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకులపై సీబీఐ, ఈడీ దాడులతో భయపెట్టి లొంగదీసుకుని నయా నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటుందని, 200-220 సీట్లు మించబోదని, రాబోయేది సంకీర్ణ యుగమని తెలిపారు.