ఎమ్మెల్యేని అభినందించిన ముఖ్యమంత్రి 

జడ్చర్ల, మహానాడు: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల  విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జడ్చర్ల నియోజకవర్గంలో 27 వేల మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతంగా అందజేశారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.