మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్

ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

అత్తలూరు, మహానాడు:  ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. అమరావతి మండలం అత్తలూరు గ్రామపంచాయతీ పరిధిలో గల నూతలపాటి వారి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోని అధికారంలోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు.

తెలుగు వారి కీర్తిని దశ దిశల చాటిన మహనీయుడు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలని తపన పడిన మానవతావాది నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అని అన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం రైతులకు టార్ఫాలిన్ పట్టాలు మరియు కౌలు రైతు కార్డులు అందజేశారు.