– మంత్రి లోకేష్
అమరావతి, మహానాడు: యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది…. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా నా దృష్టికి తెచ్చారని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారికి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప నైవేద్య సాయం రూ.10 వేలకు పెంచాం. దీనివల్ల రాష్ట్రంలోని 5400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడుతుంది. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం మాది అని ఆయన తెలిపారు.