Mahanaadu-Logo-PNG-Large

జగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడింది

• వైసీపీ నేతలు గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటున్నాయి
• వైసీపీ నేతలకు నిద్ర పట్టడంలేదు
• లండన్ నుండి వచ్చిన జగన్ మొట్టికాయలు వేయడంతో కారుకూతలు కూస్తున్న నేతలు
• చంద్రబాబు ఎక్కడి వెళ్లాడో చెప్పాలంటూ బుకాయింపులు
• చంద్రబాబు ఎక్కడికి వెళితే వీళ్లకు ఎందుకు?
• జగన్ లా చంద్రబాబుపై కేసులు లేవు
• జగన్ రెడ్డి తీసుకున్నట్లు… కోర్టులో పర్మిషన్ తీసుకుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు
• అధికారం పోతున్నా… కరెంట్ బిల్లులు పెంచి జగన్ మరోసారి జనం నడ్డి విరిచాడు
• ప్రజలు, వ్యాపారస్తులపై పెను భారం వేశాడు
• రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి… ప్రజ సొమ్ములతో విమానాలు హెలికాఫ్టర్లలో తిరుగుతున్నాడు
– టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్

పోతూ పోతూ మరోసారి కరెంట్ బిల్లులు పెంచి జనం నడ్డిని జగన్ రెడ్డి విరిచాడని.. వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

డూండి రాకేష్ మాట్లాడుతూ.. ప్రజల సొమ్ములతో హెలికాఫ్టర్లు, విమానాల్లో తిరుగుతూ ప్రజలను అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పుల ఊబిలోకి నెట్టాడు. జగన్ రెడ్డి అరాచక పాలనకు ముగింపు పడింది. వైసీపీ నాయకులు చేసిన తప్పులు వారి కళ్ల ముందు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటున్నాయి. భవిష్యత్ ఏంటో తెలియక మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గుళ్ల చుట్టూ తిరుగుతున్నాడు.

విదేశాల నుండి తిరిగి వచ్చిన జగన్ మొట్టికాయలు వేయడంతో బూడిద రమేష్ ప్రెస్ మీట్ పెట్టాడు. చంద్రబాబు బాబు పర్యటన వివరాలు బయట పెట్టాలంటా?లోకేష్ ఎక్కడికి వెళ్లాడో చెప్పాలంటా. నువ్వు ఎవరు అడగడానికి జోగి రమేష్.. నీకేంటి సబంధం.. నువ్వు ఎందుకు అడుగుతున్నావ్? మీ నాయకుడు ఎక్కడానికి వెళ్లినా కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి.

మానాయకుడు ఎవరికి చోప్పుకోవాల్సిన అవసరంలేదు. మీ నాయకుడు దావోస్ వెళతానని… ఎక్కడికి వెళ్లాడో మీరే సమాధానం చెప్పాలి. మీ నాయకుడు రావడానికి వీళ్లేదని అక్కడి ఎయిర్ పోర్టులో ఆపేశారు. లండన్ వెళుతున్న జగన్ రెడ్డి విమానం గాల్లోనే గిరగిర తిరిగి ఎమ్స్టార్డ్ ఎయిర్ పోర్ట్ లో ఎందుకు ఆగింది. చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడే ముందు మీ నాయకుడు పాస్ పోర్టులు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి.

ఓటమి భయంతో జనాలకు పక్కదారి పట్టించడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు నిద్ర కూడా పోకుండా చంద్రబాబు వారి కలలోకి వస్తున్నాడు. లోకేష్ రెడ్ బుక్ లో వీళ్ల పేర్లు అన్ని ఉన్నాయి. ప్రజల సొమ్ములతో జగన్ రెడ్డి పబ్బం గడిపాడు. వేల కోట్లు అప్పులు చేశాడు.. పక్కనే పది కిలోమీటర్ల దూరానికి హెలికాఫ్టర్ వాడి ప్రజలు సొమ్ములు దుర్వినియోగం చేశాడు.

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడు. ఒక వేలు చంద్రబాబువైపు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మీవైపే చూపిస్తాయి. వైసీపీ నేతలు ఇది తెలుసుకోవాలి. మీలాగా 36 కేసులు మా నాకుడిపై లేవు.. మీ లాగా కోర్టుల్లో పర్మిషన్ పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం మా నాయకుడికి లేదు. మీకు లాగా ఒక దేశానికి వెళ్తామని మరోదేశానికి దొంగదారిన వెళ్లి పబ్బం గడుపుకోవాల్సిన అవసరం మా నాయకుడికి లేదు

నాలుగురోజులు ఆగితే అందరి లెక్కలు తేలుతాయి. సత్రాల ఆస్తులు అమ్ముకున్న దౌర్భాగ్యుడివి నీవు జోగి. వైసీపీ నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలి… జగన్ రెడ్డి ఉచ్చులో పడితే మూల్యం చెల్లించుకుంటారు. జగన్ హిప్నటైజ్ కు గురైతే ఇబ్బందులు పడతారు. జనం ఓట్లు వేశారు. ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలవబోతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చట్టాలను అతిక్రమించిన వారికి, వ్యవస్థలను నాశనం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతాం. వ్యాపారస్తుల ఇబ్బందులను చంద్రబాబు సెట్ రైట్ చేస్తారు.