మొహమ్మద్ ప్రవక్త మార్గం ఆచరణీయం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: అల్లాకు ఇష్టమయిన చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా శాంతి ర్యాలీలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మధవి తెలిపారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం మొహిద్దిన్ పాలెంలోని దర్గా వద్ద నుండి ప్రారంభమయిన శాంతి ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ కాలనీ వల్ల గల కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….

మానవాళిని శాంతి మార్గంలో నడిపించటానికి ఎనలేని కృషి చేసి, మానవుడు జీవితం ఎలా గడపాలో నేర్పిన మహోన్నతుడు ముహమ్మద్ ప్రవక్త అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగర ప్రజలకు, ముస్లిం సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే ఈద్ మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపారు. నల్ల చెరువు మెయిన్ రోడ్డు ముస్లిం మదరసా వద్ద వ్యాపార సముదాయాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు.