మైనార్టీల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

– మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
– రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
– వరద ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న మసీదులకు మైకు సెట్లు, కార్పెట్లు పంపిణీ

విజయవాడ: రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇదే లక్ష్యంతో కార్యాచరణ అమలుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.

రువారం విజయవాడలో వరద విపత్తుతో ముంపుకు గురైన ప్రాంతాలలో నష్టపోయిన 60 మసీదులకు మైక్ సెట్లు, ముసల్లాలు (కార్పెట్) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

అంజుమన్ అహలే ఇస్లాం ప్రొద్దుటూరు కడప జిల్లా, కర్నూల్ ముస్లిం సోదరులు జాహిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో,మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సహకారంతో నిర్వహించిన పంపిణీ కార్యక్రమానికి మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరుగుచున్నదన్నారు.

కొత్త మసీదుల నిర్మాణం, మసీదుల, మరమ్మత్తులకు ప్రత్యేకంగా నిధులు, ముస్లిం మైనారిటీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు, దుల్హన్ పథకం, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య సదుపాయం ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నెరవేర్చడం జరుగుతుందని అన్నారు. విజయవాడలో గతంలో ఎన్నడు లేని విధంగా వరద ముంపుతో తీవ్ర నష్టం జరిగిందన్నారు.

వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అన్నారు. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే ముంపుకు గురైన ప్రాంతాల్లో నీటమునిగిన గృహాలకు గతంలో ఎన్నడు లేని విధంగా పరిహార మొత్తాన్ని తమ ప్రభుత్వం ప్రకటించిదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మసీదులు పూర్తిగా వరద నీటితో మునిగిపోయి నీటి మోటార్లు , మైక్ సెట్లు , స్పీకర్లు , జానిమాజ్లు అన్ని మునిగిపోయి ఒక్కొక్క మసీదుకు లక్ష నుంచి రెండు లక్షల నష్టం వాటిల్లినట్టు గుర్తించడం జరిగిందని,ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని అన్నారు.అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధుల సమస్యను గుర్తించి అన్ని ప్రభుత్వo చేయాలంటే సాధ్యం కాదని, తన వంతు కర్తవ్యాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించాలనే ఉద్దేశంతో రాయలసీమ ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్నందున , కొంతమంది ముఖ్య నాయకులతో మాట్లాడి వెంటనే వాటికి మరమ్మతులు చేయించేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నట్లు మంత్రి అన్నారు.

బోర్డు సీఈఓ నివేదిక మేరకు దాదాపు 60 మసీదులలో వరద ప్రభావానికి దెబ్బతిన్నట్టుగా గుర్తించడం జరిగిందని, ఈ మసీదులన్నింటికీ తక్షణసాయంగా కడప జిల్లా పొద్దుటూరు, కర్నూలుకు చెందిన ముస్లిం సోదరులు మొదటి విడతగా నష్టపోయిన మైక్ సెట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారని కృతజ్ఞతలు తెలిపారు.

దాదాపు 9 లక్షల ఖర్చుతో కూడిన 60 మైక్ సెట్ లను, ఆమ్ప్లిఫైర్స్ ,13 లక్షల ఖర్చుతో జానిమాజ్ (ప్రేయర్ మాట్స్) లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలని,ఇప్పటికే వందలాది మంది దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ,టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిలు ఎంఎస్ బేగ్, అబ్దుల్ రజాక్,మౌలానా హుస్సేన్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇస్మాయిల్ ఖురేషి, తొహిద్ అంజుమ్, నాదిర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.