Mahanaadu-Logo-PNG-Large

పిన్నెల్లిపై హైకోర్టు ఆంక్షలు ఇవే

అమరావతి: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ షాక్‌ తగిలింది. మధ్యంతర బెయిల్‌ ఇస్తూ తీర్పు చెప్పిన హైకోర్టు ఆయన కదలికలపై మాత్రం కొన్ని ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్ల కూడద ని ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోనే వచ్చే నెల 6వ తేదీ వరకు ఉండాలని తెలిపింది. కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు ఆ రోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ కేసు విషయంలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా తో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని పేర్కొంది.