Mahanaadu-Logo-PNG-Large

జూన్‌ 2 నుంచి టోల్‌గేట్‌ చార్జీల మోత

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు జూన్‌ 2 నుంచి పెంచనున్నాయి. ఏటా ఏప్రిల్‌ 2న ఈ చార్జీలను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్‌ 2 నుంచి టోల్‌ చార్జీలను సగటున 5 శాతం పెంచి వసూలు చేయనున్నారు.