దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలు
పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ‘బ్లూ రెసిడెన్సీ’ పేరిట వీసాలు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు వీటికి అర్హులు. ఈ వీసాల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచించింది