– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
కంచికచర్ల, మహానాడు: గత సర్కారు వైసీపీ పాలనలో ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం అయ్యాయని, రాష్ట్రాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా కూటమి సర్కారు శరవేగంగా అడుగులు వేస్తోందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. విభజన గాయాల నుంచి కోలుకునే దశలో మాజీ సీఎం జగన్ చేసిన విధ్వంసం నుంచి బయటపడడానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆమె సోమవారం కంచికచర్ల మండలం గండేపల్లిలో కీసర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. స్థానిక సెంతిని సంస్థ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎత్తిపోతల పథకం మరమ్మతు పనులకు 25 లక్షల రూపాయలను అందించడం అభినందనీయమని అన్నారు. అంతేకాకుండా కేసర నుండి గండేపల్లి వరకు ఉన్న రోడ్డుని అభివృద్ధి చేయట కొరకు ముందుకొచ్చిన సెంటిని యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందన అభినందిస్తున్నట్టు అదేవిధంగా ప్రభుత్వం నుండి తప్పనిసరిగా సహకారం కంపెనీకి కూడా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో స్కీం అభివృద్ధికి రైతు నాయకులు మందడపు పేరయ్య, రైతులు తోడ్పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత పాలకులు కనీస పనులు కూడా చేయకుండా మోటార్లను ధ్వంసం చేసి ఎత్తిపోతల పథకాలను భ్రష్టు పట్టించారని ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యానికి కారణం నాటి వైఎస్ జగనేనని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. ఇది ఏమైనా కూటమి ప్రభుత్వం మంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఏపీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చేలా పనులను పరుగులు పెట్టిస్తున్నారని రైతుల హర్షద్వానాల మధ్య మధ్య సౌమ్య వ్యక్తం చేశారు. అధికారులు, కూటమి నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.