Mahanaadu-Logo-PNG-Large

హింసా రాజకీయాలు జగన్ రక్తంలోనే ఉన్నాయి

– దొంగే దొంగ దొంగ అన్నట్లు సజ్జల వ్యాఖ్యలు
– మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్ రావు

అమరావతి: దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్ మండిపడ్డారు. టీడీపీ హింసా రాజకీయాలు చేయబోతోంది..పోలింగ్ బూత్ లలో అల్లర్లు సృష్టిస్తుంది అన్న సజ్జల వ్యాఖ్యల వెనుకే ఏదో కుట్ర ఉందనే అనుమానం కలుగుతుందని కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు.

హింసా రాజకీయాలు, పోలింగ్ అక్రమాలు, దాడులు అనేది జగన్, వైసీపీ రక్తంలోనే ఉన్నాయని కంభంపాటి అన్నారు. నామినేషన్లు వేయకుండా, ప్రజలు సక్రమంగా పొలింగ్ కు వెళ్లకుండా అల్లర్లు సృష్టించిన చరిత్ర వైసీపీదే అని ఆయన అన్నారు. రేపటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసకు దిగేందుకు వైసీపీ పన్నాగం పన్నిందని….ఆ కుట్ర బయటకు రాకుండా టీడీపీ పై ముందు గానే ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ అన్నారు.

తామే నేరాలు చేయడం…వాటిని వేరే వారిపై నెట్టేయడం అనేది వైసీపీ పార్టీ సిద్దాంతం అని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్టేషన్ సజ్జల వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికలు జరగాలి అనేదే తమ అభిమతమని…దీనిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యం ఫేక్ ప్రచారాలు, డీప్ ఫేక్ వీడియోలే వైసీపీలో ఓటమి భయానికి సాక్ష్యం అని మాజీ ఎంపీ కంభంపాటి అన్నారు.