Mahanaadu-Logo-PNG-Large

సీఎస్‌పై ఈసీకి అంత ప్రేమ ఎందుకో?

-కౌంటింగ్‌కు ఆయనను పక్కన పెట్టాలి
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు

వినుకొండ: వరుస వివాదాల్లో ఉంటూ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఎన్నికల సంఘం ఎందుకంత ప్రత్యేకంగా చూస్తోంది? ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజ నేయులు ప్రశ్నించారు.

కీలకమైన ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యక్తిని సీఎస్‌గా కొనసాగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. కౌంటింగ్‌ రోజు కూడా ఇలాంటి వ్యక్తి చేతుల్లో అధికార యంత్రాంగం ఉండడం అత్యంత ప్రమాదకరమన్న ఆయన ఎన్నికల సంఘం ఇకనైనా సీఎస్‌ను పక్కన పెట్టాల్సిన తరుణం వచ్చిందన్నారు. విశాఖ భూ కుంభకోణంలో ఈసీ సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మారడం ఖాయమన్న సం కేతాల నేపథ్యంలో ఆయన ఇంకా ఆ పదవిలో ఉంటే తన అధికారం, పలుకుబడిని ఉవయోగించి సాక్ష్యాల తారుమారు చేయడం, రికార్డులు మార్చడం వంటివి చేసే ప్రమాదం కూడా ఉందని ఈసీ గుర్తించాలని సూచించారు.