ఉచిత ఇసుకతో సంబరాల్లో కార్మికులు  

గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుకను అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ భవన నిర్మాణ కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి భవన నిర్మాణ కార్మికులతో సంబరాల్లో పాల్గొన్నారు. కార్మికులు ఎమ్మెల్యే గళ్ళా మాధవికి స్వీట్స్ తినిపించి ఆనందాన్ని వెలిబుచ్చారు.