అమరావతి: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీలేఖను కౌంటింగ్ విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13న జరిగిన పోలింగ్లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గానికి కొత్త ఆర్వోను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు.