అమరావతి: స్కూల్ పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది. ఇప్పటివరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా కొత్త ప్రభుత్వం రావడంతో ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు. అలాగే వాటిపై ‘జగనన్న గోరు ముద్ద’ అని ఉండగా దానిని తొలగించారు. గురువారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండటంతో విద్యార్థులకు చిక్కీల తో పాటు కోడిగుడ్లు, రాగి పిండి సరఫరా చేయనున్నారు.