గుంటూరు, మహానాడు: తాడికొండ నియోజకవర్గ వైసీపీ నేతలు, ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్కుమార్ శుక్రవారం పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలో తమకు మొండిచెయ్యి చూపారని, జిల్లా పరిషత్ అభివృద్ధి నిధుల కోసం పలుసార్లు వేడుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయ త్నించి విఫలమయ్యామని, పార్టీలో దళితులపై వివక్ష ఉందని ఆరోపించారు. పెత్తందారులే అక్కడ లాబీయింగ్ చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రజలకు న్యాయం చేయలేమని భావించి పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కత్తెర దంపతులు ప్రకటించారు.