Mahanaadu-Logo-PNG-Large

5 దశల్లో 50.72 కోట్ల మంది ఓటేశారు

దేశంలో తొలి 5 దశల ఎన్నికల్లో 76.41 కోట్ల మంది ఓటర్లకు గాను 50.72 కోట్ల మంది ఓటు వేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ 19న 102 ఎంపీ స్థానాలకు 11 కోట్ల మంది, ఏప్రిల్‌ 26న 88 ఎంపీ స్థానాలకు 10.58 కోట్ల మంది, మే 7న 94 స్థానాలకు 11.32 కోట్లు, మే 13న 96 స్థానాలకు 12.25 కోట్లు, మే 20న 49 స్థానాలకు 5.57 కోట్ల ఓట్లు నమోదయ్యాయని వెల్లడిరచింది. గణాంకాల వెల్లడిలో ఆలస్యం లేదని, పోలింగ్‌ సమాచారం ఎప్పటికప్పుడు యాప్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడిరచింది.