ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించాలి

– ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్

ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం మాట తప్పింది. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుండి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట ఛార్జీలు, కోడిగుడ్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.