మంగళగిరిలో నారా లోకేష్‌కే ప్రజా మద్దతు

భారీ మెజార్టీతో గెలుపు ఖాయం
నియోజకవర్గ రూపురేఖలు మారుస్తారు
భవిష్యత్‌ తరాల కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి
ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్‌ కుటుంసభ్యులు
పాల్గొన్న నందమూరి సుహాసిని, గారపాటి శ్రీనివాస్‌

మంగళగిరి టౌన్‌: మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా మద్దతు యువనేత లోకేష్‌కే ఉందని, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని నారా లోకేష్‌ కుటుంబసభ్యులు ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు మద్దతుగా మంగళగిరి పట్టణం 16, 18 వార్డుల్లో గురువారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, మహిళలు వారికి ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సూపర్‌-6 కార్యక్రమాలను వివరించారు. చిరువ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు విజన్‌తో అభివృద్ధి: నందమూరి సుహాసిని

నందమూరి సుహాసిని మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతిఓటు అమూల్యమైందని పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్‌తో పాటు వారి పిల్లల భవిష్యత్‌ బాగుండాలంటే కూటమి ప్రభుత్వం విజయం సాధించాలన్నారు. చంద్రబాబునాయుడు విజన్‌ అందరికీ తెలుసని, సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుం దున్నారు. నేడు ప్రపంచ పటంలో హైదరాబాద్‌ నిలిచిందంటే ఆయన ముందుచూపే కారణమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. అప్పుడే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ప్రజలకు మెరుగైన సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతుందన్నారు. మంగళగిరిలో కూటమి అభ్యర్థి నారా లోకేష్‌, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

కూటమి ప్రభుత్వంతోనే మహిళా సంక్షేమం

రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ద్వారానే మహిళా సంక్షేమం సాధ్యమని సుహాసిని పేర్కొన్నారు. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 అందించడంతో పాటు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏడాదికి ఉచి తంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినున్నట్లు వెల్లడిరచారు. చంద్రబాబునాయడు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళలను శక్తివంతంగా తయారు చేశారని, కూటమి ప్రభుత్వంలోనూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తారని తెలిపారు.

ఐదేళ్లుగా అధికారంలో లేకున్నా కార్యక్రమాలు: గారపాటి

ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌కు మద్దతు గా మూడురోజులుగా కుటుంబసభ్యులం ఎన్నికల ప్రచారం చేస్తున్నామన్నారు. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా అధికారంలో లేకపోయినా లోకేష్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, వైద్య, విద్య, ఇతర కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. మంగళగి రి నియోజకవర్గ రూపురేఖలు మార్చి అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్‌, పార్లమెంట్‌ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గారపాటి లోకేశ్వరి, నందమూరి మాధవి మణి, కంఠమనేని శ్రీనివాస్‌ ప్రసాద్‌, డి.కవిత ప్రసాద్‌, డి.ప్రసా ద్‌, గౌరినేని చంద్ర, గౌరినేని శాంతి, వల్లూరిపల్లి దుర్గాప్రసాద్‌, వల్లూరిపల్లి శారద, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.