అమెరికాలో తుఫాన్‌ బీభత్సం..నలుగురి మృతి

అమెరికాలోని నాలుగో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌ పెను తుఫాన్‌తో వణికి పోయింది. ఈ తుఫాన్‌ కారణంగా నలుగురు మృతిచెందారు. 8 లక్షల గృహా లు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వేలాది భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. వరద నీటితో పలు వీధులు జలమయమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ముందుజాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేశారు. రెండు విమానాశ్రయాల్లో విమానాల రాక పోకలకు అంతరా యం ఏర్పడిరది.