నగరిలో రోజా ఓటమిపై వైసీపీ సంబరాలు

తిరుపతి : నగరిలో రోజాపై వైసీపీ అసమ్మతి వర్గం ఆగ్రహం తారాస్థాయికి చేరింది. ఓడిపోయినా వారి ఆగ్రహం చల్లారడం లేదు. గురువారం వైసీపీ అసమ్మతి నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రోజాపై నగరి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ శాంతి తీవ్ర విమర్శలు చేశారు. రోజా ఓటమితో నగరి కి పట్టిన పదేళ్ల పీడ విరగడైంది. నగరి ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకుం టున్నామని తెలిపారు. రోజా అడుగుపెట్టినప్పటి నుంచి వైసీపీకి శని పట్టిందని, టికెట్‌ ఇవ్వకపోయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. కుటుంబ పాలనతో అక్రమాలకు పాల్పడిన రోజాను ప్రజలు చిత్తుగా ఓడిరచారని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు.