కృష్ణా నది వరద ముంపు బాధితులకు ఆహారం

– దాతృత్వాన్ని చాటుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌

తోట్లవల్లూరు, మహానాడు: పామర్రు నియోజకవర్గం, తోట్లవల్లూరు దగ్గర గల కృష్ణా నది వరద ముంపు బాధితులు 400 మందికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ భోజనాలు పెట్టారు. అలాగే పాము లంక గ్రామ ప్రజలకు కూడా ఆటోలో భోజనాలు పంపించారు. తోట్ల వల్లూరు లోని జడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రంలో లంక గ్రామాల ప్రజలు ఉంటున్నారు. భోజనాలను బాధితులకు ఎమ్మెల్యే కుమార్ రాజా వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా రాజేంద్రప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ… అకాల వరదతో కృష్ణానది లంక గ్రామాల ప్రజలు ఐదు రోజులుగా పునరావస కేంద్రాల్లో ఉంటున్నారని, వారికి ఏ లోటు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ మానవసేవే – మాధవ సేవగా భావిస్తున్నారని, పూర్తిగా పరిస్థితులు చక్కదిద్దుకునే వరకు ఈ ప్రజలను ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వీరపనేని శివరాం, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ల ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, రాష్ట్ర సగర సాధికార కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, డి.పి.ఓ నాయక్, కొండాలమ్మ తల్లి గుడి మాజీ చైర్మన్ కొండ, నెక్కలపూడి మురళీ, కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ జక్క శ్రీనివాసరావు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.