ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

ఇద్దరు చిన్నారుల దుర్మరణం
40 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు
హైదరాబాద్‌ నుంచి ఆదోనికి వెళుతుండగా ఘటన

కర్నూలు, మహానాడు : కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా 40 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో కొందరు చిక్కుకున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోనికి అతి వేగంగా వెళుతూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రు లు హాహాకారాలు చేస్తున్నారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ, గోవర్ధినిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.