Mahanaadu-Logo-PNG-Large

నిడుముక్కలలో పోలీసు బలగాలతో కవాతు

ఇరువర్గాలతో డీఎస్పీ సమావేశం
ప్రశాంతతకు సహకరించాలని సూచన
శాంతి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం

గుంటూరు, మహానాడు : గుంటూరు జిల్లా తాడికొండ పోలీసుస్టేషన్‌ పరిధిలోని నిడుముక్కల గ్రామంలో ఆదివారం పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. తుళ్లూరు డీఎస్పీ అశోక్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గ్రామంలో రెండువర్గాలతో సమావేశం నిర్వహించారు. తాత్కాలిక ఆవేశాలకు గురికాకుండా శాంతియుతంగా వ్యవహ రించాలని సూచించారు. గ్రామంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడేందుకు సహక రించాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో వివాదాలు జరిగిన కారణంగా ఈ సమావేశం నిర్వహించారు. శాంతి కమిటీ ఏర్పాటుకు కోరగా వారు కొంత సమయం ఇవ్వాలని అడగడంతో మళ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్ప ట్లోగా కమిటీ ఏర్పాటుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు. సొంత నిర్ణయాలు తీసుకుని వివాదాస్పద పరిస్థితులకు అవకాశం కల్పించకుండా సహ కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడికొండ సి.హెచ్‌.ప్రభాకర్‌, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.