పొదిలి, మహానాడు: ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్వల్పంగా భూమి కంపించింది. సుమారు రెండు సెకండ్ల పాటు కంపించి, శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పట్టణంలో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. పొదిలి పట్టణంలో సరైన నీటి వనరులు లేక భూకంపాలు సంభవిస్తున్నాయని డాక్టర్ షేక్ ఇమాంసా అన్నారు.