మాజీమంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల
మంగళగిరి , మహానాడు: భారత దేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి… మిసైల్ మ్యాన్ గా కీర్తింప బడిన మహనీయుడు … రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన ఘనుడు.. సమస్త ప్రపంచానికి ఆదర్శప్రాయుడు, నిరాడంబరుడు క్షిపణి పితామహుడు, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.
కలాం వర్ధంతి సందర్భంగా మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూల దండలు వేసి ఆయన సేవలను కొనియాడారు. మిసైల్ మ్యాన్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకుని కుల మతాలకు అతీతంగా దేశానికి సేవలు చేయాలని కోరారు.
నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీమంత్రి పీతల సుజాత, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, పార్టీ నేతలు చప్పిడి రాజశేఖర్, పర్చూరి కృష్ణ, హాజీ హసన్ భాషా, దేవినేని శంకర్ నాయుడు, గోళ్ళ ప్రభాకర్, షేక్ రసూల్, కొండలు తదితరులు ఉన్నారు.