-తన ఓటమిని ఇతరులపై రుద్దుతున్నాడు
-జగన్ బటన్ నొక్కితే ఓటేయాలా?
-ఘోరాలు, నేరాలు జనం మరిచిపోలేదు
-ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నాడు
-ప్రజలు ఏకగ్రీవంగా మాకొద్దు అని ఓట్లు వేశారు
-ఘోరంగా ఓడిపోయినా పరనింద వేయడం సిగ్గుచేటు
-వైసీపీ ఘోర ఓటమికి జగన్ రెడ్డే కారణం
-ఏడుపు ముఖం పెట్టుకుని మాట్లాడితే దళితులు కరగరు
-వారిపై నేరాలు, అఘాయిత్యాలు దళిత బిడ్డలు మరిచిపోలేదు
-మాచర్లలో జరిగిన రావణకాష్టను జనం మరచిపోలేదు
-సిగ్గులేకుండా మళ్లీ గవర్నర్కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు
-దాడులు మా పందా కాదు…దానికి చంద్రబాబు ఒప్పుకోరు
-జగన్ ఇకనైనా మొసలి కన్నీరు ఆపాలి
-సీబీఐ 11 చార్జిషీట్లలో ఒక్కరోజు కోర్టుకు హాజరుకాలేదు
-ఇక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలి
-దోషి అని రుజువు అయితే కటకటాల్లో వేయాలి
మంగళగిరి: ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రెడ్డి ఆత్మస్తుతి చేసుకోకుండా జనా లపై నిందలు వేస్తున్నాడని జగన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ఓటమిని ఇతరులపై రుద్దు తున్నాడు. జగన్ బటన్ నొక్కితే ఓటేయాలా? జగన్ చేసిన ఘోరాలు నేరాలు జనం మరిచిపోలేదు. ఆయన ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నాడు. ప్రజలం దరూ ఏకగ్రీవంగా మాకొద్దు ఈ జగన్ అని ఓట్లు వేశారు. ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోయినా ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా పరనింద వేయ డం సిగ్గుచేటు. వైసీపీ ఘోర ఓటమికి జగన్ రెడ్డే కారణం.
దళిత బిడ్డలపై హింసాకాండను మరువరు
ఏడుపు మొఖం పెట్టుకుని మాట్లాడితే దళితులు కరగరు. దళితులపై జరిగిన హింసాకాండను దళిత బిడ్డలు మరిచిపోలేదు. మాచర్లలో జరిగిన రావణకాష్టను జనం మరచిపోలేదు. సిగ్గులేకుండా మళ్లీ గవర్నర్కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. మీరు స్థానిక ఎన్నికల్లో ఏ రకంగా వ్యవహరించారో అందరికి తెలుసు. మాచర్ల కు వెళ్లిన బుద్దా వెంకన్న, బోండా ఉమాలపై ఐరన్ రాడ్లతో దాడి చేసినప్పుడు అవి నేరాలు ఘోరాలు కాదా? మాచర్ల నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామం లో వైసీపీ నేతల అరాచకాలకు భయపడి 250 ఎస్సీ కుటుంబాలు ఆ ఊరికి విడిచి వెళ్లిపోయారు. అప్పుడు మా అధినేత చంద్రబాబు వారిని వాళ్ల గ్రామం లోకి తీసుకెళ్లాలని చూస్తే చంద్రబాబును బయటకు రాకుండా గేటుకు తాళ్లుకట్టారు. అప్పుడే చంద్రబాబు చెప్పారు నా ఇంటి గేటుకు కట్టిన తాళ్లు మీ అధికారానికి ఉరితాళ్లుగా మారుతుందని అదే నిజమైంది.
ఎస్సీలు చీకొట్టారు..
నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్నారు… వారి కోసం ఏం చేశారు? 29 ఎస్సీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే రెండు మాత్రమే వైసీపీ గెలిచింది.. మిగిలిన 27 టీడీపీ గెలిచిందింది. వైసీపీకి ఎస్సీలు బానిసలు కాదని.. నిరంకుశ, నియం తృత్వ, ప్రజా వ్యతిరేక పాలనను ఎస్సీలు చీకొట్టారని ఎన్నికల ఫలితాలతో అర్థం అవుతుంది. ఆ రెండు సీట్లు కూడా మా వారు చేసిన చిన్న పోరపాటుతో మీరు గెలిచారు. ఎస్సీలందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారు. ఇకనైనా జగన్ పరనింద మానుకోవాలి.. ఏడుపు మొఖం పెట్టుకుని మాట్లాడితే దళితులు కరగరు.
దళితులపై ఘాతుకాలు మరిచిపోరు
మాస్క్ అడిగినందుకు సుధాకర్ను చంపిన వాస్తవాన్ని మరిచిపోరు. ఇసుక దందా జరగుతుందని చెప్పినందుకు పోలీసుస్టేషన్లో వరప్రసాద్ను శిరోముం డనం చేసింది దళిత బిడ్డలు మరిచిపోలేదు. దళిత బిడ్డను వైసీపీ వర్గాలు మానభంగం చేసి పోలీసుస్టేషన్ ముందు పడేసింది మరిచిపోలేదు. మాస్క్ పెట్టుకోలేదని దళిత బిడ్డను కిరణ్కుమార్ను కొట్టి కొట్టి చంపింది మరిచి పోలేదు. నీ దొంగ సారాపై ప్రతాప్ మాట్లాడితే తెల్లారేసరికి చంపేసి ఉరేసుకు న్నట్లు చిత్రీకరించారు. పులివెందులలో దళిత మహిళ నాగలక్ష్మిని కొట్టి మానభం గం చేసి హత్య చేసింది మరిచిపోలేదు. వెటర్నరీ డాక్టర్ అచ్చెన్న హత్యను మరిచిపోలేదు. నకరికల్లులో గిరిజన మహిళను ట్రాక్టర్తో తొక్కించింది మా దళి తులు మరిచిపోలేదు. టంగుటూరు దగ్గర దళిత మహిళను చనిపోయే వరకు ట్రాక్టర్తో తొక్కించింది దళిత బిడ్డలు మరచిపోలేదు. చంద్రయ్య అనే వ్యక్తి జై చంద్రబాబు అన్నందుకు పీక కోసి చంపింది మరచిపోలేదు.
గవర్నర్ దగ్గరకు వెళ్లి కళ్లబొల్లి ఫిర్యాదులు చేస్తే నమ్ముతారా?
గవర్నర్ దగ్గరకు వెళ్లి కళ్లబొల్లి ఫిర్యాదులు చేస్తున్నారు. మాచర్లలో రావణ కాండను అప్పుడే మరచిపోయారా? నంగనాచిలా ఏ తప్పు చేయనట్లు చెప్పుకుం టారా? అమరావతిలో దళిత రైతులకు బేడీలు వేసి వీధుల్లో తిప్పింది మా దళిత బిడ్డలు మరిచిపోలేదు. చంద్రబాబు ప్రచార రథంపై ఉన్నా కూడా 307 పెట్టి వేధించారు. టీడీపీ అరాచకం చేయాలనుకుంటే వైసీపీ నేతలు ఎవరూ మిగల రు. అది మా పందా కాదు. మా అధినేత దానికి ఒప్పుకోరు. మా నాయకుడు ఒక్క కనుసైగ చేస్తే మీరు ఏమౌతారో తెలుసా? కౌంటింగ్లో రెండో రౌండ్కే మీ నేతలు పారిపోయారు. మీరు నేరాలు, ఘోరాలు చేశారు కాబట్టే రాష్ట్రాన్ని విడిచి పారిపోయే దుస్థితి వచ్చింది. మీరు గవర్నర్ వద్దకు వెళితే జనం నమ్ముతారా? ఇసుక, ల్యాండ్, మైనింగ్ దేనిని వదలకుండా దోచుకున్నారు. వంద గొడ్లు తిన్న రాబందులా.. మూతికి ఉన్న రక్తాన్ని తుడుచుకుని గవర్నర్ దగ్గరకు వెళితే నమ్ముతారా?
అధికారుల లెక్కలన్నీ తేలాలి
కొల్లి రఘురామరెడ్డి, సునీల్కుమార్ వంటి డిప్యూటేషన్పై వచ్చి అరాచకాలకు సహకరించిన అధికారుల లెక్కలన్నీ తేలాలి. చట్టబద్ధంగానే వీరిపై చర్యలు ఉం టాయి. ఓట్లు వేయలేదని ఏడుపు మొఖంతో జగన్ మాట్లాడతున్నాడు. జగన్ రెడ్డి ఏం చేశాడని జనం ఓట్లు వేస్తారు. అందుకే దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి ఓడిరచారు. జగన్ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకుని కోర్టులను కూడా తప్పుదారి పట్టించారు. సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో ఒక్కరోజు కూడా కోర్టుకు హాజరుకాలేదు. జగన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి. సీఐబీ ప్రతిరోజు విచారణ జరపాలి. రాష్ట్ర ప్రజలకు అనుమానం ఉన్నది జగన్ రెడ్డి. ఎందుకు ఇంత వెసులుబాటు కల్పించారో కోర్టు క్లారిటీ ఇవ్వాలి. ఆయన మీద ఉన్న 11 కేసుల్లో వెంటనే విచారణ చేపట్టి నిర్ధోషి అయి తే వదిలేయాలి. దోషి అయితే అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఉన్నారు. జగన్ రెడ్డి లోపలా.. బయటా అనేది. త్వరితగతిన న్యాయ విచారణ జరిపాలి. జగన్ ఇకనైనా మొసలి కన్నీరు ఆపాలి… జగన్ రెడ్డి భవిష్యత్లో చెల్లించాల్సింది చాలా ఉంది.