– ఒకేరోజు 3 లక్షల మందికి భోజనం
విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో అక్షయ పాత్ర సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకేరోజు 3 లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనత సాధించింది. విజయవాడ వాసుల్ని ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో 3 లక్షల భోజనం ప్యాకెట్లు తయారు చేసి పంపించింది. అక్షయపాత్ర సర్వీసులో ఇదే రికార్డు అని సంస్థలో పని చేసే వారు తెలిపారు.