Mahanaadu-Logo-PNG-Large

మేయర్‌, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు యత్నం

అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి కాంగ్రెస్‌ కుట్రలు
ట్విట్టర్‌ వేదికగా ఖండిరచిన మాజీమంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, మహానాడు : పీర్జాదిగూడ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఎలాగైనా సరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, కార్పొరేట ర్లను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమె త్తారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ దాడిని పార్టీ తర పున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. డీజీపీ, రాచకొండ కమిషనర్‌ వెంటనే పీర్జాదిగూడ మేయర్‌, కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని కోరారు. ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడడం గర్హనీయమని, ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.