చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దు
ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైనది
రుషికేశ్ వెళుతున్నా..ముందుగా ఆశీర్వదిస్తున్నా
ఆయన గొప్పగా పరిపాలిస్తారు
ఈసారైనా దేవాలయాల పాలన బాగుండాలి
అమరావతిలోనూ శారదాపీఠం నిర్మిస్తాం
విశాఖ స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలు
విశాఖపట్నం: శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సోమవారం మీడియా సమావేశంలో కూటమి గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభు త్వం మారింది. గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్లం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం మాది కాదు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైనది. ప్రజలకు మేలు గలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వాదం అందజేస్తున్నాం. కేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నాం. అమరావతిలో కూడా శారదా పీఠం నిర్మిస్తాం. ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్ష పాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. త్వరలోనే చాతుర్మాస దీక్షల కోసం రుషికేశ్ వెళ్తున్నా. అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నా. హైదరాబాద్లోని శారదా పీఠంలో స్థిరపడాలని అనుకుంటున్నాం. నాకు అత్యంత ఆత్మీయుడు ఆయిన ఎర్రన్నాయుడు కుమారు డు కింజరాపు రామ్మోహన్నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషంగా ఉంది. అమ్మ వారి కృపతో మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయడం ఆనం దం కలిగించిందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దు
చంద్రబాబు గెలవాలని గతంలో మురళీమోహన్తో కలిసి సాధువులందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి పూజలు చేశాం. ఎవరికీ భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టడం లేదు. తప్పుడు అభిప్రాయాలు వెల్లడిరచకుండా ప్రెస్ మీట్ పెడు తున్నాం. చంద్రబాబు అంటే చాలా గౌరవం.. చాలా సీనియర్ నేత. ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఈసారైనా దేవాలయాల పాలన బాగుండాలని ఆకాంక్షిం చారు.