మంగళగిరిలో కేక్ కట్చేసిన వర్ల రామయ్య
శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు
అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కేక్ కట్ చేసి ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సినీ నిర్మాత, దక్షిణ భారత నిర్మాతల సంఘ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్కు తినిపించారు. స్వీట్లు పంచి పెట్టారు. బాలకృష్ణ సేవలను కొనియాడారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా హిందూపు రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమాజ హితమైన సినిమాల తో మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి పాల్గొని బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, కాపు మల్లికార్జున యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.