Mahanaadu-Logo-PNG-Large

జోష్ పెంచిన బాలయ్య పర్యటన

తెలుగుదేశం పార్టీలో నవ్యాంధ్ర సాకార యాత్రలో భాగంగా నందమూరి బాలకృష్ణ పర్యటన విజయవంతం కావడంతో ఆ పార్టీలో మరింత జోష్ పెరిగింది. సూలూరుపేట లో ఆదివారం సాయంత్రం ఆయన పర్యటన అద్యంతం ఆకట్టుకుంది. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలని.. జగన్ నియంత పోకడ దూరం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు . నవ్యాంధ్ర మరింత అభివృద్ధి చెందాలంటే బాబు ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రజలు కోరుతున్నారని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

అభ్యర్థులైన వరప్రసాద్, విజయ్ శ్రీ లను తప్పకుండా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీమంత్రి పరసా వెంకటరత్నం, టిడిపి నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, గంగా ప్రసాద్ ,ఎన్.బి.కె.ఆర్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి, పేరం మధు నాయుడు, వేలూరు మురళి కృష్ణారెడ్డి ,దేవారెడ్డి నాగేందర్ రెడ్డి ,సంచి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

పేట వైకాపా కౌన్సిలర్ టిడిపి తీర్థం
పేట వైకాపాకు గట్టి దెబ్బ తగిలింది ఇక్కడ వైకాపా వార్డు కౌన్సిలర్ నలబోయిన చిట్టిబాబు బాలకృష్ణ సమక్షంలో టిడిపిలో చేరారు. దీంతో ఇక్కడ పార్టీ మరింత బలపడినట్లు అయింది.