రుణాలపై భారం లేకుండా జాగ్రత్త పడండి

డాలరు-రూపాయి మధ్య తేడాతోనే తంటాలు
రుణం-గ్రాంట్లపై కేంద్రాన్ని స్పష్టత కోరండి
ప్రపంచబ్యాంకు షరతులను నిశితంగా పరిశీలించండి
పర్యావరణ షరతులే ప్రధానం
ఎన్జీటీ తీర్పు దృష్టిలో పెట్టుకోండి
పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేయండి
సీఎం చంద్రబాబుకు మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ

విశాఖపట్నం: ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి 15వేల కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. కేంద్రం ఇచ్చే రుణాలు-గ్రాంట్లపై స్పష్టత కోరాలని, ప్రధానంగా ప్రపంచబ్యాంకు రుణాలు-షరతులపై నిశిత పరిశీలన చేయాలన్నారు. ముఖ్యంగా పర్యావరణ షరతులు, ఇటీవల ఏపీ సర్కారుకు ఎన్జీటీ ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని పర్యవేక్షక కమిటీ వేయాలని సూచించారు.
శర్మ లేఖ పూర్తి పాఠమిదీ..

విశాఖపట్నం

గౌరవనీయులు శ్రీ N చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
శ్రీ చంద్రబాబు నాయుడు గారు,

రెండు రోజుల క్రింద, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి గారు అమరావతి రాజధాని ప్రాజెక్టు కోసం, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి, రాష్ట్రానికి Rs 15,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందిస్తామని పార్లమెంటులో ప్రకటించడం సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.

గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రపంచ బ్యాంకు Board of Governors లో భారతదేశం తరఫున Governor గా, ఉన్న నా అనుభవం ఆధారంగా, ఈ క్రింద సూచించిన విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ క్రింది విధంగా, కేంద్రం నుంచి ముందస్తు హామీలు తీసుకోవాలి

ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థల consortium రాష్ట్రానికి ఇచ్చే నిధులు, రాష్ట్రానికి Finance Commission ద్వారా వచ్చే నిధుల మీద అదనంగా కేంద్రం release చేయాలి. ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థల నుంచి వచ్చే నిధులు dollar ల రూపంలో ఉండటం కారణంగా, dollar-rupee exchange ధర పెరగడం వలన, రుణభారం అధికంగా పెరిగే అవకాశం ఉంది.

ఆ విషయం దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు, భవిష్యత్ లో రుణభారం ఎంతవరకు పెరగగలదో అంచనాలు వేసి, ఆ భారాన్ని తగ్గించే దిశలో, కేంద్రం ఇప్పించే Rs 15,000 కోట్లలో, ఎంత grant గా ఇవ్వాలి, ఎంత రుణంగా ఇవ్వాలి అనే విషయం మీద కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో చర్చించి, ఇవ్వవలసిన grant వాటా మీద ముందస్తు హామీ తీసుకోవాలి.

ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణాలు, పర్యావరణ దృష్ట్యా షరతులతో ముడిపడివుంటాయి. గతంలో అదే ప్రపంచబ్యాంక్, ఇతర సంస్థలు, అమరావతి ప్రాజెక్టు కు కావలసిన నిధుల మీద ఒక విపులమైన ప్రణాళిక ను తయారు చేసి అప్పటి మీ ప్రభుత్వంతో చర్చలు చేయడం, ఆ ప్రాంతంలో కొంతమంది నిర్వాసితులు చేసిన ఫిర్యాదులకు స్పందించి బ్యాంకు వారు ఆ ఫిర్యాదులను పరిశీలించే Inspection Team ను నియమించడం, ఆ Inspection Team ఫిర్యాదు చేసిన వ్యక్తులను, ప్రాంత ప్రజలను కలిసి, వారి అభిప్రాయాలను సేకరించి, బ్యాంక్ ఉన్నతస్థాయిలో వారి రిపోర్ట్ ఇవ్వడం, మీకు గుర్తు చేస్తున్నాను.

ఆ Inspection Team రిపోర్ట్ ప్రభుత్వం వద్ద ఉండవచ్చు. ఆ రిపోర్టులో ప్రస్తావించిన విషయాలకు అనుగుణంగా, మీ ప్రభుత్వం బ్యాంకు కు కొత్త ప్రాజెక్టు ప్రణాళిక ను ఇస్తే, ప్రాజెక్టు కు అనుమతులు రావడం సులభం అయ్యే అవకాశం ఉంది.
అదేకాకుండా, అమరావతి ప్రణాళిక మీద, జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) వారు OA No 171/2017 లో 2017 నవంబర్ లో ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం గురించి ప్రపంచ బ్యాంకు వారు ప్రశ్నించే అవకాశం ఉంది.
NGT వారి judgement కాపీ ఇక్కడ జత పరుస్తున్నాను

NGT వారు, అమరావతి ప్రాజెక్టు అమలు సందర్భంలో, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను పాటించాలని, ఆ విషయం మీద పర్యవేక్షణ కోసం, క్రింద సూచించిన సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించాలని, ఆ కమిటీ వారు ప్రతి ఆరు నెలలకు NGT వారికి రిపోర్టులు పంపించాలని ఆదేశించారు.

Director, National Institute అఫ్ Hydrology, Roorkee
A senior scientist nominated by Indian Institute of Science (IISc)
Prof N J Pawar, Savitribai Phule University (Pune)
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు అటువంటి కమిటీ ని నియమించక పోవడం NGT ఆదేశాలను ఉల్లంఘించడం అయింది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా అటువంటి పర్యవేక్షణ కమిటీ ని నియమించడం అవసరం.

ఈ దిశలో రాష్ట్రప్రభుత్వం అమరావతి ప్రాజెక్టు విషయంలో ముందుకు పోగలదని ఆశిస్తున్నాను.

ఈ ఏఎస్ శర్మ
విశాఖపట్నం
25-7-2024