-భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్ నాటికి పూర్తి
-ఎకనమిక్ హబ్గా భోగాపురం
-పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు
-భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై జీఎంఆర్ ప్రతినిధుల ప్రజెంటేషన్
భోగాపురం, మహానాడు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇదొక పెద్ద అసెర్ట్. భవిష్యత్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోయే నగరం. ఈ ఎయిర్పోర్టుతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్ లో ఈ ఎయిర్పోర్టు వస్తోంది. ఫేజ్-1లో భోగాపురం వరకు బీచ్ రోడ్డు, ఫేజ్-2లో ఇంకో 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్-3లో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీంతో మూలపేట నుంచి సమాంతర హైవే, బీచ్ రోడ్డు ఇప్పుడున్న హైవేకు అనుసంధానమైతే, మధ్యలో కొన్ని కనెక్టివిటీలు పెట్టుకుంటే పారిశ్రామికాభివృద్ధికి ఇదొక అద్భుత నగరంగా మారుతుంది. మరో నగరం, ప్రాంతం కూడా దీనికి తలదన్నేలా ఉండవు. ఎప్పట్నుంచో చెబుతున్నా.. ఇదే నా కల. దానిని ఇప్పుడు సాకారం చేసుకునే పరిస్థితి వచ్చింది.
రూ.4,700 కోట్లతో ఫేజ్-1 ప్రారంభం
ఈ ఎయిర్పోర్టును మనం చూస్తే.. 20 మే 2015న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే తెలియజేశాను. 7 అక్టోబర్ 2016న కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. దీనికి అప్పట్లో 2,700 ఎకరాలు కావాలని అనుకున్నాం. 2,700 ఎకరాలు అక్వైర్ చేశాం. 2023 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే వీళ్లు వచ్చి మొత్తం టింకర్ చేశారు. ప్రాజెక్టును ఆడుకునే పరిస్థితికి తెచ్చారు. ఇప్పుడు మరలా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేశారు. శంకుస్థాపన చేసిన దానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. మొత్తానికి వారి పిల్ల చేష్టలు, పిచ్చోళ్ల చేష్టలతో దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు.
నేటి వరకు 31.8 శాతం పనులు పూర్తయ్యాయి. నేను ఎయిర్ పోర్టు నిర్మాణ పనులపై సమీక్ష చేయడం జరిగింది. యాదృచ్ఛికంగా ఉత్తరాంధ్ర బిడ్డ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కట్టేవాళ్లు, డెవలపర్ కూడా ఉత్తరాంధ్ర వాళ్లే. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరూ కూడా దీన్ని డెవలప్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్పోర్టు 2.8 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.
భోగాపురం ఎయిర్పోర్టు 4.5 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించేలా స్టార్ట్ అవుతుంది. దీని కెపాసిటీ 45 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించే అవకాశం ఉంది. అదే సమయంలో రూ.4,700 కోట్లతో ఫేజ్-1 ప్రారంభిస్తున్నారు. 2200 ఎకరాలు వీరి ఆధీనంలో ఉన్నాయి, ఇంకొక 500 ఎకరాలు కూడా ఇవ్వడానికి ఆమోదం తెలుపుతున్నాం.
ఎకనమిక్ హబ్గా భోగాపురం..
వీరంతా స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తీసుకుని రావాలి. ఎన్ని ఉద్యోగాలు కల్పించగలరు, ఏ యాక్టివిటీస్ తీసుకొస్తారు, ఎలా అభివృద్ధి చేస్తారనే దానిపై నివేదిక కోరాం. ఈ ఎయిర్ పోర్టు కనుక పూర్తయితే రాయగఢ్, కోరాపూర్, మల్కన్ గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది. రివ్యూలో కొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి నేషనల్ హైవే నుంచి 6 కిలోమీటర్ల మేర రోడ్ కనెక్టివిటీ, పాత నేషనల్ హైవేలో 12 చోట్ల కనెక్టివిటీ, జంక్షన్లను అభివృద్ధి చేయాలి.
ఏ ఎయిర్పోర్టుకైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ నుంచి బయలుదేరినా నేరుగా విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఈ భోగాపురం ఎయిర్పోర్టును కూడా అదేవిధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీంతో ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా తయారవుతుంది. ఇక్కడ యువత వేరే ప్రాంతాలకు వెళ్లే పరిస్థితులు రావు. అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం.
ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాం..
ఈరోజు నేను ఇక్కడకు ప్రధానంగా వచ్చింది కూడా మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు. ఓట్ల వర్షం కురిపించారు. రాష్ట్రమంతా సునామీ, ఆ సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్ర. నేను కూడా సందేశం ఇవ్వాలనే ఇక్కడకు వచ్చాను. ఎప్పుడూ కూడా ఓట్లు వేసిన వర్గాలను కానీ, ప్రాంతాలను మర్చిపోవడం సబబు కాదు. అందరికీ న్యాయం చేస్తాం కానీ ఉత్తరాంధ్రకు అదనంగా చేయాల్సి ఉంది. ఆ నమ్మకం కూడా మామీద పెట్టుకున్నారు. నా పర్యటనల షెడ్యూల్ కూడా మీరు చూస్తే జిల్లాల పర్యటనలో మొదటగా ఉత్తరాంధ్రకే వచ్చాను. తర్వాత రాయలసీమకు వెళ్తున్నాను. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 2026, వాళ్లు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందే పూర్తి చేయమంటున్నాను. 2026 జూన్ 30న వచ్చి దీనిని ఆపరేషన్ చేయాలి. అందుకు పూర్తిగా సహకరిస్తాం.
ఈ ప్రాజెక్టును పరిగెత్తిస్తాం. రామ్మోహన్ నాయుడుకు చెప్పాను.. నేను పోలవరాన్ని ఎలా అయితే రెగ్యులర్గా సమీక్షిస్తానో, మీరు కూడా అలా చేయమని కోరాను. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. దీనిని పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలి. విమానాయానశాఖ మంత్రిగా మీ అనుభవం కూడా ఉపయోగపడుతుంది. అన్ని ఎయిర్పోర్టులను చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్తో ఒక మోస్ట్ మోడరన్ ఎయిర్పోర్టు. విశాఖపట్నం రావాలి దానికి దోహదం చేయమని కోరాను.
హిస్టారికల్ విక్టరీ.. ఐ యామ్ వెరీ హ్యాపీ..
నేను మొదటి ఎయిర్పోర్టును జీఎంఆర్ కు ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను. 20-30 నమూనాలు తయారు చేశారు. అప్పుడే దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులు వచ్చాయి. హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్లు అభివృద్ధి చెందారు, దేశం అభివృద్ధి చెందింది. అభివృద్ధికి ఒక మూలంగా, గ్రోత్ ఇంజన్గా విమానాశ్రయాల డెవలప్ రూల్ తయారైంది. అవసరమైతే మళ్లీ వస్తాను.
భోగాపురం ఎయిర్పోర్టుకు సమాంతరంగా మరో 5-6 ఎయిర్పోర్టులు వస్తాయి. కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్ అలాగే మూలపేట కూడా ఆలోచిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే.. విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం. వీళ్లు చూపించిన అభిమానానికి ఎన్ని సమస్యలున్నా సపోర్ట్ గా ఉంటాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్గారికి కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతమిది. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు. హిస్టారికల్ విక్టరీ వచ్చింది. ఐ యామ్ వెరీ హ్యాపీ…