Mahanaadu-Logo-PNG-Large

నంద్యాలలో వైసీపీకి భారీ షాక్‌

టీడీపీలోకి 12వ వార్డు నాయకులు
శిల్పా కుటుంబ పాలన నచ్చకే వలసలు
ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్‌ సమక్షంలో చేరిక

నంద్యాల : జగన్‌ విడుదల చేసిన మేనిఫెస్టోతో జగన్‌ రాజకీయ అస్త్రసన్యాసం చేస్తాడని, తమ సూపర్‌ సిక్స్‌ ముందు వారి మేనిఫెస్టో వెలవెలబోయిందని మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ అన్నారు. 12వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు ఇసుక డిపో చాంద్‌బాషా, బషీర్‌, అప్సర్‌, షేరు, వలి బాషా, జోసఫ్‌ తంబి, అబ్దుల్లా, వలి, పుల్లయ్య , షేక్షా, అమీర్‌లతో పాటు 300 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఫరూక్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ విత్తనావృద్ది సంస్థ చైర్మన్‌ ఎ.వి.సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తులసిరెడ్డి, నంద్యాల టీడీపీ అబ్జర్వర్‌ పోతురాజు రవికుమార్‌, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.ఎం.డి.ఫిరోజ్‌, 12వ వార్డు నాయకులు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.