హైదరాబాద్, మహానాడు: అసెంబ్లీ ఎల్పీ కార్యాలయం లో బీజేఎల్పీ సమావేశం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే ల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేఎల్పీ చర్చించనుంది. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఎలా ఇరుకున పెట్టాలన్న దాని పైనా చర్చ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం, ఉద్యోగ నోటిఫికేషన్ లు, జాబ్ క్యాలెండర్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వంటి అంశాలపై చర్చ. రైతు రుణమాఫీ, రైతు పంట సాయం, నిరుద్యోగుల పైనా ప్రభుత్వం ను నిలదీయాలని వ్యూహం రచించనున్నారు.
 
								