Mahanaadu-Logo-PNG-Large

బ్రాహ్మణపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తా

వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలి
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణపల్లి సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపిస్తామని సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రచారంలో తప్పెట్లతో గ్రామస్తులు స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర హీనుడు ఎవరంటే ముక్తకంఠంతో జగన్‌ పేరే చెబుతారన్నారు. ఆయన వచ్చాక రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయా యన్నారు. పారిశ్రామికవేత్తలను తమ కమిషన్ల కోసం జగన్‌రెడ్డి అంతగా వేధించాడు. అడ్డగోలు నిబంధనలతో అర్హులకు సంక్షేమ పథకా లు దూరం చేశారు. వైసీపీి రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వాన్ని కులదోసేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో కూటమి నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.