సొంత ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు
కేసీఆర్ రాజకీయ జూదగాడు..పార్టీ బతికేది లేదు
హరీష్..ఆత్మాహుతి దళాలుగా మారితే కనుమరుగైపోతావ్
మోదీ గ్యారంటీకి వారంటీ చెల్లింది..రాజీనామా చేయాలి
ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
ప్రజాపాలనకు రెఫరెండం ఈ ఎన్నికలు…ఓట్ల శాతం పెరిగింది
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: గాంధీభవన్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి. రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారు. వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాం. ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పాం. 17 పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు కాంగ్రెస్కు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.5 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మా ఓట్ల శాతం పెరిగింది..మా పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ఫలితాలతో అర్థమవుతోంది. కంటోన్మెం ట్ ఉపఎన్నికల్లో గెలిపించి ప్రజలు మాకు మరో సీటు అదనంగా ఇచ్చారు.
బీజేపీ కోసం అవయవదానం
2019లో బీజేపీ 4 గెలిస్తే ఈ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నిక ల్లో 20 శాతం ఉన్న ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో 35 శాతానికి పెరిగాయి. బీజేపీ ని గెలిపించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవ దానం చేశారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆర్ఎస్ ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ తమ ఓట్లను పూర్తిగా బీజేపీకి బదిలీ చేశారు. రఘునందన్రావుకు ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీన వర్గాల బిడ్డను ఓడిరచారు. వెంకట్రామి రెడ్డిని నమ్మించి మోసం చేసి మరీ కేసీఆర్ బీజేపీని గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు పొందిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపో యింది. 2023లో 13 శాతం ఓట్లున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో 35.5 శాతానికి ఓట్లు పెరిగాయి.
బూడిదైన బీఆర్ఎస్ మళ్లీ పుట్టేది లేదు
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ బీజేపీకి తాకట్టు పెట్టారు. పూర్తిగా ఓట్లను బదలాయించి కేసీఆర్ రాజకీయ ఆరాచకానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో తనంతట తానే అంతర్థానమై బీజేపీకి కేసీఆర్ మద్దతు గా నిలిచారు. బూడిదైన బీఆర్ఎస్ మళ్లీ పుట్టేది లేదు..వందరోజుల్లోనే మాపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు. కుట్రపూరితంగా వ్యవహ రించిన ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకో వాలని సూచన చేస్తున్నానని వ్యాఖ్యానించారు.
దెబ్బతీయాలనుకుంటే కనుమరుగైపోతావ్
హరీష్… ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ను దెబ్బతీయాలనుకుంటే చివరికి కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతారు. మోదీ గ్యారంటీ పేరుతో బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారు. బీజేపీ 303 సీట్ల నుంచి 243కి పడిపోయింది. మోదీ గ్యారంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారు. దేశ ప్రజలు మోదీని తిరస్కరించారు. తక్షణమే మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్చేశారు. ఇప్పటికైనా బీజేపీ అప్రజాస్వామిక తీరును మార్చుకోవాలి.
ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
ఇప్పటివరకు 18 గంటలే పనిచేశాం.. ఇకనుంచి మరో రెండు గంటలు ఎక్కువ పనిచేస్తాం..రాష్ట్రంలో గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత నాదే..వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి..కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రభోదానుసారం వ్యవహరించాలి. కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు… ఆయన ఉన్నంత కాలం కుట్రలు కుతంత్రాలు కొనసా గుతూనే ఉంటాయి. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు అన్న బీజేపీ… బీఆర్ ఎస్తో ఎలా జతకడుతుందో చూడాలి. ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటాం..ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు.