Mahanaadu-Logo-PNG-Large

ల్యాండ్‌ టైటిలింగ్‌ జీవో కాపీల దహనం

గుంటూరు/సత్తెనపల్లి, మహానాడు: గుంటూరు, సత్తెనపల్లిలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ జీవోకు సంబంధించిన కాపీలను శుక్రవారం కూటమి నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌నగర్‌ కన్నా కార్యాలయంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో

గుంటూరు: స్థానిక పార్లమెంటరీ కార్యాలయం వద్ద శుక్రవారం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ జీవో కాపీలను దహనం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌, తాడిశెట్టి మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు.